అక్టోబరు 25, నవంబరు 8న శ్రీవారి ఆలయం మూత
ABN, First Publish Date - 2022-09-08T09:45:37+05:30
అక్టోబరు 25, నవంబరు 8న శ్రీవారి ఆలయం మూత
తిరుమల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సూర్య గ్రహణం (అక్టోబరు 25న), చంద్ర గ్రహణం (నవంబరు 8న) కారణంగా ఆయా రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం 12 గంటలపాటు మూసివేస్తారు. అక్టోబరు 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆ రోజు ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సందర్భంగా ఆ రోజు అన్ని దర్శనాలతోపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం భక్తులను మా త్రమే దర్శనానికి అనుమతిస్తారు. నవంబరు 8న మఽధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం దృష్ట్యా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు.
Updated Date - 2022-09-08T09:45:37+05:30 IST