AP News: శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2022-08-15T14:00:10+05:30
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.
నంద్యాల: శ్రీశైలం జలాశయాని (Srisailam reseroir)కి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,79,455 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,81,142 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Updated Date - 2022-08-15T14:00:10+05:30 IST