Srikakulam: వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం
ABN, First Publish Date - 2022-05-26T16:08:24+05:30
సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది.
శ్రీకాకుళం: సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. ముందుగా సెవెన్ రోడ్డు జుంక్షన్ వద్ద దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం బస్సు యాత్రను మొదలుపెట్టారు. జిల్లాలోని చిలకపాలెం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా విజయనగరం జిల్లాకు మంత్రులు వెళ్లనున్నారు.
ట్రాఫిక్ జామ్...
మరోవైపు... మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంత్రుల బస్సులు, వీఐపీల వాహనాలు రోడ్లపైనే నిలిపేయటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
Updated Date - 2022-05-26T16:08:24+05:30 IST