ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-05-22T05:34:51+05:30
ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
- టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్
సోంపేట రూరల్ : ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్ ఆరోపించారు. శనివారం సోంపేటలోని చీకటి హరిజన, జాలారి, తెలగ వీఽధుల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్య క్షుడు బీన ఆనందరావు, చిత్రాడ శేఖర్, దూసి మధు, రెల్ల శ్రీను, మడ్డు రవికుమార్, కొత్తపల్లి నాగరాజు, దానయ్య పాల్గొన్నారు.
- కొత్తూరు : నిత్యావసరాలతోపాటు పెట్రోల్, డీజిల్, గాస్ తదితర వాటిపై ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలపై జగన్ ప్రభుత్వం భారం మోపిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ మండిపడ్డారు. శనివారం లబ్బ, కారిగూడ, ఓండ్రుజోల గ్రామాల్లో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయ న పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. తెలుగు యువత అధ్యక్షుడు చింతాడ కోటేశ్వరావు, సర్పంచ్ అచ్యుత, పార్టీ నాయ కులు మాతల గాంధీ, మెహనరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-22T05:34:51+05:30 IST