ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారినికోసారైనా నీరివ్వడం లేదు

ABN, First Publish Date - 2022-12-31T23:48:55+05:30

టీడీపీ హయాంలో 2014లో పట్టణంలో ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేశామని, అయితే ప్రస్తుతం వారానికి ఒకసారి కూడా నీరందించని పరిస్థితి నెలకొందని టీడీపీ కౌన్సిలర్లు గురిటి సూర్య నారాయణ, వజ్జ బాబూరావు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, డిసెంబరు 31: టీడీపీ హయాంలో 2014లో పట్టణంలో ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేశామని, అయితే ప్రస్తుతం వారానికి ఒకసారి కూడా నీరందించని పరిస్థితి నెలకొందని టీడీపీ కౌన్సిలర్లు గురిటి సూర్య నారాయణ, వజ్జ బాబూరావు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. రూ. లక్షలు వ్యయం చేస్తున్నా ఎం దుకు నీరందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పట్టణంలో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క కాలు వను కూడా శుభ్రం చేసే పరిస్థితి లేదని, పర్యవేక్షణ కొరవడుతోం దని విమర్శించారు. పట్టణంలోనే 550 పింఛన్లను రద్దు చేశా రని, బాధితుల ఉసురు తగులుతుందని ఆక్షేపించారు. దీని పై చైర్మన్‌ గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఒక సారి సర్వే చేసి లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతుల ద్వారా పింఛ న్లు ఇవ్వడం జరుగుతుందని, తొలగించిన వాటిని పునః పరి శీలించి అర్హత ఉన్న వారికి పింఛన్లు పునరుద్ధరిస్తామన్నారు. సమావేశంలో కమిషనర్‌ టి.రాజగోపాలరావు, ఏడీఈ ఐ. హరికృష్ణ, వైస్‌ చైర్మన్లు బోర కృష్ణారావు, మీసాల సురేష్‌ బాబు, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising