ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీపై మాట తప్పారు

ABN, First Publish Date - 2022-06-30T05:00:11+05:30

ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న ఇప్ప టి సీఎం జగన్మోహన్‌రెడ్డి, పాత పట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2013 భూ సేకరణ చట్టం అమలు చేస్తామని వంశధార నిర్వాసితులకు హామీ ఇచ్చి ఇప్పుడు దానిని తుంగలో తొక్కి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం వారు నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి
హిరమండలం: ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న ఇప్ప టి సీఎం జగన్మోహన్‌రెడ్డి, పాత పట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2013 భూ సేకరణ చట్టం అమలు చేస్తామని వంశధార నిర్వాసితులకు హామీ ఇచ్చి ఇప్పుడు దానిని తుంగలో తొక్కి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం వారు నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ కమ్యూ నిటీ హాల్‌లో వంశధార నిర్వాసితులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలంటే  ప్రతి ఎకరాకి రూ.19 లక్షల తో పాటు పీడీఎఫ్‌ ప్యాకేజికి రూ.13 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే వాటి నుంచి తప్పించుకునేందుకు కేవలం రూ.లక్ష చొప్పున మంజూరు చేసి మమ అనిపించేశారని విమర్శించారు. హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసి పి.బుచ్చి బాబు, నిర్వాసితులు చింతాడ గిరి, లంక రామారావు, పి.అప్పలనాయుడు, టి.రమేష్‌, ఎ.సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Updated Date - 2022-06-30T05:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising