ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు

ABN, First Publish Date - 2022-08-03T06:04:00+05:30

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు స్కీమ్‌లు పేరుతో స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

లండారిపుట్టుగలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ‘బాదుడే బాదుడు’లో  ఎమ్మెల్యే అశోక్‌ 

కవిటి, ఆగస్టు 2 : రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు స్కీమ్‌లు పేరుతో స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే  బెందాళం అశోక్‌ అన్నారు. మంగళవారం లండారిపుట్టుగలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల నుంచి బస్సు చార్జీలు, పెట్రో, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు ఇలా అన్నింటిపై వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యు డిపై అధిక భారం మోపుతుందన్నారు. స్కీమ్‌ల పేరుతో ప్రజలకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి వాటిని లాగేసుకుంటున్నారని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అరాచకా లను వివరించి కరపత్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.రమేష్‌, నాయకులు బాసుదేవు రౌళో, పి.సంతోష్‌, బి.తిరుమల, కె.వెంకటరావు, ఎస్‌.వెంకటరమణ, ఈశ్వరరావు, బి.చినబాబు, బి.విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెద్ద కొజ్జిరియాలో..

కంచిలి: మండలంలోని పెద్ద కొజ్జిరియా గ్రామంలో మంగళవారం టీడీపీ నాయకులు బాదుడే-బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ  వెళ్లి అధికార పార్టీ నాయకుల ఆగడాలను ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎం.రామారావు, టీవీ రమణ , వి.రమేష్‌, జగదీష్‌పట్నాయిక్‌, మన్మథరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-03T06:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising