ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2022-01-14T05:11:13+05:30

మడపాం టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టీసీ బస్సు అదపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.

డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు, ఘటనా స్థలంలో ప్రయాణికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు  

- 55 మంది ప్రయాణికులు సురక్షితం

నరసన్నపేట, జనవరి 13 : మడపాం టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టీసీ బస్సు అదపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో బస్సు బోల్తా పడేలా ఊగిసలాడడంతో ప్రయాణికులంతా భయపడి కేకలు వేశారు.  ఈ సమయంలో బస్సులో 55 మంది ఉన్నారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. టెక్కలికి చెందిన కృష్ణ.. కుడి కాలు విరిగిపోయింది. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను 108 వాహనం, నేషనల్‌ హైవే అబులెన్స్‌ల్లో ప్రథమ చికిత్స అందజేశారు.  స్టీరింగ్‌ పట్టేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-14T05:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising