14 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు
ABN, First Publish Date - 2022-01-28T05:19:35+05:30
జిల్లాలో 14 కొత్తగా ఆలయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిం చినట్లు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి
సీతంపేట: జిల్లాలో 14 కొత్తగా ఆలయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిం చినట్లు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సీతంపేటలోని సంతోషిమాతమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 25 ఏళ్లు దాటిన ప్రతి ఆలయానికి దూప, దీప, నైవేధ్యం కింద ప్రతినెలా రూ.ఐదు వేలు చెల్లిస్తామని తెలిపారు. 80 శాతం కొత్తవి, 20 శాతం పాతఆలయాల అభివృద్ధికి ఒక్కక్క దేవాలయానికి రూ.10 లక్షలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు.గ్రామాల్లో ఆలయాలు నిర్మించాలని అనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో అసిస్టెంట్కమిషనర్ శిరీష, ప్రసాదబాబు, జిల్లా అర్చకుల అధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచ్ కళావతి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - 2022-01-28T05:19:35+05:30 IST