ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌

ABN, First Publish Date - 2022-09-25T06:20:58+05:30

జాతీయ లోక్‌అదాలత్‌ను నవంబరు 12న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి భారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 24 : జాతీయ లోక్‌అదాలత్‌ను నవంబరు 12న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు. స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణలో శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ పడదగిన అన్ని క్రిమినల్‌, సివిల్‌, వాహన బీమా పరిహారం చెల్లింపు కేసుల్లో ఇరువర్గాల వారు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా చెల్లని చెక్కు కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎస్పీ మలికగర్గ్‌ మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి శివకుమార్‌, ఒంగోలు, కందుకూరు, చీరాల ఆర్డీవోలు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T06:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising