అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ దుష్టపాలన
ABN, First Publish Date - 2022-07-07T05:13:54+05:30
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ దుష్టపాలన సాగుతోందని, దీనిని అంతమొందించేలా టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరా రు. బుధవారం దేశవానిపేట, శివానగర్ కాలనీ, ఆదివారంపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ దుష్టపాలన సాగుతోందని, దీనిని అంతమొందించేలా టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరా రు. బుధవారం దేశవానిపేట, శివానగర్ కాలనీ, ఆదివారంపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర వస్తువు లు, పెట్రోలు, గ్యాస్ ధరలతో పాటు ఆర్టీసీ చార్జీలు నింగిని తాకడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు చింతు భాస్కరరావు, ఉణ్న వెంకటేశ్వరరావు, తాళాభక్తుల గోవిందరావు, గొలివి రామారావు, కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-07T05:13:54+05:30 IST