ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ధర్మాన వ్యాఖ్యలు సరికాదు

ABN, First Publish Date - 2022-06-29T06:02:34+05:30

మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతి ప్రసంగంలో కూడా డబ్భై ఐదేళ్ల పాలనలో ఇంతటి అద్భుత పాలన లేదని వ్యాఖ్యానించడం సరికాదని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న అప్పలసూర్యనారాయణ:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 టీడీపీ హయాంలోనే అభివృద్ధి

 మాజీమంత్రి అప్పలసూర్యనారాయణ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతి ప్రసంగంలో కూడా డబ్భై ఐదేళ్ల పాలనలో ఇంతటి అద్భుత పాలన లేదని వ్యాఖ్యానించడం సరికాదని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లా డారు. ఇందిరాగాంధీ హయాంలో ఆమెను, ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డిని, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డిని కీర్తించడం తప్ప జిల్లాకు ధర్మాన చేసినమేలేంటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలోనే శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణానికి, ఆమ దాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణకు నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఇంత వరకు ఆ పనులు చేపట్టకుండా  ఇప్పుడు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పుడు సీఎం వచ్చి వాటికి కొత్తగా నిధులు మంజూరు చేసినట్లు  ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి కార్యక్రమాలను ఆపకూడదని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలైంది కేవలం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో  పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ పాల్గొన్నారు.




 

Updated Date - 2022-06-29T06:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising