ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరిగిపోతున్న సైలాడ కొండలు

ABN, First Publish Date - 2022-01-03T05:00:07+05:30

సైలాడ రెవెన్యూ పరిధిలో ఉన్న చిట్టివలస సమీపంలో కొండలు కరిగిపోతున్నాయి. కొందరు అనుమతిలేకుండా కొండలు తవ్వేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.

రాయిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్‌:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆమదాలవలస: సైలాడ రెవెన్యూ పరిధిలో ఉన్న చిట్టివలస సమీపంలో కొండలు కరిగిపోతున్నాయి. కొందరు అనుమతిలేకుండా కొండలు తవ్వేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. సైలాడ రెవెన్యూపరిధిలోని సర్వేనెంబరు 183లో 230 ఎకరాలపైన సైలాడ, దివాంజీపేట, గాజులకొల్లివలసల్లో కొండలు విస్తరించిఉన్నాయి. గాజులకొల్లివలస సమీపంలో ప్రసిద్ధిచెందిన సంగమేశ్వ రాలయం కూడాఉంది. నల్లకొండలతోపాటు చిట్టివలస సమీపంలో ఎర్రకొండలు ఉన్నాయి. మార్కెట్‌లో రాయి మెటల్‌కు డిమాండ్‌ ఉండడంతో కొంతమంది రెవెన్యూ, గను లశాఖ అధికారుల అనుమతి లేకుండా కొండలను పిండిచేసి తరలిస్తు న్నారు. నిత్యం అధికారులు కొండలను తవ్వేసే మార్గంలోనే ప్రతిరోజూ సచివాలయ సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నా చర్యలు తీసు కోవడంలేదని పలువురు వాపోతున్నారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు పనులకోసం దివాంజీపేట సమీపంలో కొండలు గుల్లచేసిన విషయం విదితమే.కాగా, చిట్టివలస కొండల్లో రాళ్లు తవ్వుతున్న విషయం తనకు తెలియదని తహసీల్దార్‌ వైవీ పద్మావతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పరిశీలించి కొండలను తవ్వుతున్న వారిపై చర్యలు చేపడతామని చెప్పారు.



 



Updated Date - 2022-01-03T05:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising