ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్షరాస్యతతోనే ఆర్థిక స్వావలంబన : స్పీకర్‌

ABN, First Publish Date - 2022-03-05T05:54:55+05:30

అక్షరాస్యతతోనే ఆర్థిక స్వావలంబన : స్పీకర్‌

పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస : అక్షరాస్యతతోనే ఆర్థిక  స్వావలంబన సాధించవచ్చునని స్పీకర్‌ తమ్మినేని అన్నారు. గాజులుకొల్లివలస సమీపంలోని వంశధార నిర్వాసిత గ్రామంలో రూ.1.40 కోట్లతో నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంద న్నారు. కార్పొరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠ శాలను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. నియోజక ర్గంలో మండలానికి ఒకటి చొప్పున తాడివలస, వంజంగి, రొట్టవలస, ఉప్పినవలస గ్రామాల్లో ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే తొగరాంలో డిగ్రీ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రారంభించామన్నా రు. తొగరాంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.  డీఈవో లింగేశ్వర రెడ్డి, జడ్పీ సీఈవో లక్ష్మీపతి, సర్వశిక్షణ అభియాన్‌ పీవో రోణంకి జయప్రకాష్‌, జడ్పీటీసీ బెండి గోవిందరావు, తమ్మినేని శ్రీరామమూర్తి, సర్పంచ్‌ దమయంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising