ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్‌ నాటికి సాగునీరు

ABN, First Publish Date - 2022-05-19T04:50:59+05:30

రానున్న ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదల సలహా మండలి 28వ సమావేశం, వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ లఠ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయండి
 కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
కలెక్టరేట్‌, మే 18 :
రానున్న ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదల సలహా మండలి 28వ సమావేశం, వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై చర్చించారు. ఈ ఏడాది రుతు పవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉన్నందున, జూన్‌ 15 నాటికి సాగునీరు విడుదల చేసేందుకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయండి. నీటి తీరువా వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. బిల్లులు పెండింగ్‌లు లేవని పనులు పురోగతి సాధించేలా చూడాలి. పనుల్లో రోజువారి ప్రగతి కనిపించాలి. మిగిలిన పనులకు సంబంధించి రెండు, మూడు రోజులకు ఒకసారి బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి. నిర్వాసితులకు కోసం నిధులు మంజూరు చేశామ’ని కలెక్టర్‌ తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ... ఉపాధిహామీ పథకం ద్వారా ఛానల్‌ పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఆర్డీవో బి.శాంతి, డ్వామా పీడీ ఎం.రోజారాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising