ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్ల విచారణలో జాప్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-12-31T00:21:12+05:30

పింఛన్లపై విచారణలో జాప్యంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పది రోజులైనా ఇంతవరకు నివేదికను ఎందుకు ఇవ్వలేదని టెక్కలి సచివాల యం-2 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.రాజేష్‌పై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అసహనం వ్యక్తం చేశారు.

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: పింఛన్లపై విచారణలో జాప్యంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పది రోజులైనా ఇంతవరకు నివేదికను ఎందుకు ఇవ్వలేదని టెక్కలి సచివాల యం-2 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.రాజేష్‌పై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయాన్ని సందర్శిం చి, అందుతున్న సేవలపై విభాగాల వారీగా సమీక్షించారు. పింఛన్ల అంశం చర్చకు వచ్చిన సమయంలో సచివాలయానికి కేవలం 25 పింఛన్లు విచారణకు రాగా పదిరోజులైనా ఎందుకు పూర్తి చేయలేదని కలెక్టర్‌ ప్రశ్నించగా సిబ్బంది నీళ్లునమిలారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌.. మండల పరిధిలో పింఛన్ల విచారణలో జాప్యం చేస్తున్న మొదటి ముగ్గురు వెల్ఫేర్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయాలని మండల పరిషత్‌ కార్యాలయ ఏవో బి.రామకృష్ణకు సూచించారు. అనంతరం సచివాలయం పరిధిలోని వివిధ భూ సమస్యలు, కోర్టు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బొప్పాయిపురం సచివాలయం, ఆర్‌బీకేలకు పరిశీలించారు.

Updated Date - 2022-12-31T00:21:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising