వేతనాలివ్వనిదే పనిచేయలేం..
ABN, First Publish Date - 2022-01-04T04:54:27+05:30
సంతకవిటి మండలం జావాం, రేగిడి మండలం బొడ్డవలస సమగ్ర రక్షిత నీటి పథకాల్లో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లకు 22 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మూడు రోజులు గా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లోని 107 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని వారు స్పష్టం చేశారు.
డీఈ, కాంట్రాకర్ల సమక్షంలో పంప్ ఆపరేటర్ల చర్చలు విఫలం
రాజాం, (సంతకవిటి), జనవరి 3: సంతకవిటి మండలం జావాం, రేగిడి మండలం బొడ్డవలస సమగ్ర రక్షిత నీటి పథకాల్లో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లకు 22 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మూడు రోజులు గా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లోని 107 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జావాంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వేతన బకాయిలు చెల్లించే పరిస్థితి లేనందున తానే 2 నెలల వేతనాలు చెల్లిస్తానని, మార్చి వరకు సహకరించాలని కాంట్రాక్టర్ ఆదినారాయణ కోరారు. దీనికి వారు అంగీకరించలేదు. 22 నెలలుగా వేతనాలు లేక అప్పులు వాడుకొని అడుక్కునే స్థితిలో మీ గౌరవం కోసం మా ఉద్యోగ రక్షణ కోసం పనిచేస్తున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ఇకపై తాము పని చేయలేమని, మా వేతన బకాయిలు చెల్లించి మమ్ములను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని వారు తేల్చి చెప్పారు. అనంతరం నీటి పథకం వద్ద నినాదాలు చేశారు. చర్చల్లో ఆర్డబ్యూఎస్ డీఈ వైకుంఠంనాయుడు, జేఈ సంతోష్కుమార్, సబ్ కాంట్రాక్టర్ కురిటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-04T04:54:27+05:30 IST