పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు
ABN, First Publish Date - 2022-11-17T00:10:30+05:30
పాఠశాలల పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఎంఈవో అరసాడ రవి అన్నారు. బుధవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన సీఆర్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జి.సిగడాం: పాఠశాలల పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఎంఈవో అరసాడ రవి అన్నారు. బుధవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన సీఆర్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు-నేడు పనులు, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి అవసరం ఉందన్నా రు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎంఈవో రెడ్డి రామకృష్ణంనాయుడు, సూర్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-17T00:10:31+05:30 IST