డొంకూరులో ‘బాదుడే బాదుడు’
ABN, First Publish Date - 2022-06-23T05:49:53+05:30
డొంకూరులో ‘బాదుడే బాదుడు’
ఇచ్ఛాపురం రూరల్ : బూర్జపాడు పంచాయతీ డొంకూరులో ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాడి సహాదేవురెడ్డి, డి.కామేష్, డి.లోకనాధం, ఎల్.పద్మనాభం, బోర ప్రసాద్, అంబటి ఈశ్వరరావు, బి.లోహి దాసు, పి.చంద్రశేఖర్, బి.మోహనావు పాల్గొన్నారు.
చండిపుట్టుగలో...
కవిటి: చండిపుట్టుగ, వింధ్యగిరి గ్రామాల్లో టీడీపీ మండలాధ్యక్షుడు మణిచంద్రప్రకాష్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.రమేష్, నాయకు లు సంతోష్ పట్నాయక్, బాసుదేవు, హరికృష్ణ పాల్గొన్నారు.
దండులక్ష్మీపురంలో..
పోలాకి: ప్రభుత్వ వైఫల్యాలను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావా లని నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ‘బాదుడే బాదుడు’ కా ర్యక్రమంలో భాగంగా దండులక్ష్మీపురం, సత్రవుపేట, చింతాడపేట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తు న్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ డోల ప్రసాదరావు, టీడీపీ నాయకులు కిల్లివేణు, మిరియబ్బిల్లి వెంకట అప్పలనాయుడు, రోణంకి కృష్ణంనాయుడు, కోరాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బడ్డుమర్రి పంచాయతీలో..
పాతపట్నం: బడ్డుమర్రి పంచాయతీలో టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు పైల బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వ హించారు. పంచాయతీ ఎస్జేపురం, రాజన్నపేట, కొత్తూరు, బడ్డుమర్రి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సంద ర్భంగా కరపత్రాలు, కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు, విసనకర్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు యువత పాల్గొన్నారు.
Updated Date - 2022-06-23T05:49:53+05:30 IST