‘గిరిభూమి పోర్టల్తో అన్ని హక్కులు’
ABN, First Publish Date - 2022-11-09T23:14:16+05:30
గిరిభూమి పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే భూమిపై అన్ని హక్కులు పొంద వచ్చ ని కొత్తూరు వెలుగు అసోసియేషన్ ఏరియా కోఆర్డినేటర్ నాగరాజు అన్నా రు. శోభ గిరిజన పంచాయతీ రేంగూడ, కొమ్మలగూడ, కరకాసింగి, బూర్జ గూడ, లక్ష్మిగూడ, గులిమిసింగిగూడల్లో బుధవారం అటవీహక్కులపై అవ గాహన సదస్సులు నిర్వహించారు.
పాతపట్నం: గిరిభూమి పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే భూమిపై అన్ని హక్కులు పొంద వచ్చ ని కొత్తూరు వెలుగు అసోసియేషన్ ఏరియా కోఆర్డినేటర్ నాగరాజు అన్నా రు. శోభ గిరిజన పంచాయతీ రేంగూడ, కొమ్మలగూడ, కరకాసింగి, బూర్జ గూడ, లక్ష్మిగూడ, గులిమిసింగిగూడల్లో బుధవారం అటవీహక్కులపై అవ గాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆదివాసీ గిరిజనుడికి తన భూమిపై 1-బి ఉండేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిభూమి పోర్టల్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ పోర్టల్లో నమోదు చేయడంతో అన్ని ప్రభుత్వ పథకాలకు, వ్యవసాయ ప్రోత్సాహకాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మండల ఏరియా కోఆర్డినేటర్ ఎ.చిరంజీవి, జి.జగన్నాధం, ఎస్.కామేశ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-09T23:26:52+05:30 IST