ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రోయిన్‌ను గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-03T05:58:52+05:30

బాహుదా నదిపై ఉన్న గ్రోయిన్‌ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో రాతికట్టు పూర్తిగా పాడైపోయింది. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. శివారు ఆయకట్టుకు సాగునీరందడం లేదు. దీంతో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. దాదాపు 1,800 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం

శ్రమదానం చేసి రాతికట్టుకు అడ్డంగా ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రమదానం చేసి బాగుచేసుకున్న రైతాంగం

ఇచ్ఛాపురం, ఆగస్టు 2 : బాహుదా నదిపై ఉన్న గ్రోయిన్‌ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో రాతికట్టు పూర్తిగా పాడైపోయింది. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. శివారు ఆయకట్టుకు సాగునీరందడం లేదు. దీంతో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. దాదాపు 1,800 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో 1,000 మంది రైతులు తలో చందాలు పోగుచేసుకొని గ్రోయిన్‌ మరమ్మతు పనులకు శ్రీకారంచుట్టారు. మంగళవారం 3,500 ఇసుక బస్టాలతో గట్టు నిర్మాణం చేపట్టారు. ఇందుకుగాను రూ.50 వేలు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సొంత నిధులతో శ్రమదానం చేసి బాగుచేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. 




Updated Date - 2022-08-03T05:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising