Srikakulam: పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత
ABN, First Publish Date - 2022-07-05T14:08:44+05:30
జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు.
శ్రీకాకుళం: జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక కొబ్బరి తోటలో పుట్టగొడుగులు కోసం స్థానికులు ఎగబడ్డారు. చివరకు వాటిని తిని గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2022-07-05T14:08:44+05:30 IST