AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మళ్లీ పాత పాటే పాడిన కేంద్రం
ABN, First Publish Date - 2022-07-19T21:51:29+05:30
ఏపీ (AP)కి ప్రత్యేక హోదా (special status)పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది.
న్యూఢిల్లీ (Delhi): ఏపీకి ప్రత్యేక హోదా (AP special status)పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొంది. మంగళవారం లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ (Nithyananda Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.
Updated Date - 2022-07-19T21:51:29+05:30 IST