ప్రత్యేక హోదాపై బీజేపీనే అడగండి: స్పీకర్ తమ్మినేని
ABN, First Publish Date - 2022-02-17T01:33:24+05:30
ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో పెట్టి ఎందుకు తీసేసారో బీజేపీ
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో పెట్టి ఎందుకు తీసేసారో బీజేపీ నేతలనే అడగాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలపై వైసీపీ ఎంపీలు పోరాడుతున్నారన్నారు. వైసీపీ ఎంపీలను రాజీనామా చేయాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలివి ప్రదర్శిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయనకు ఉన్న తెలివి మాకు లేదా అని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హోదాను ప్రక్కన పెట్టి ప్యాకేజీకి సంతకం పెట్టింది ఎవరని ఆయన ప్రశ్నించారు.
పార్లమెంట్ తలుపులు వేసి విభజన బిల్లు ఆమోదిస్తే బీజేపీ కిమ్మనకుండా చూసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని ఆశాస్ట్రీయంగా విభజన జరిగిందంటే ఎవరూ నమ్మరన్నారు. ప్రధాని మాటలు నమ్మటానికి ప్రజలు అమాయకులు కాదని ఆయన అన్నారు.
Updated Date - 2022-02-17T01:33:24+05:30 IST