Somu Veerraju : జగన్ బటన్ మీద చెయ్యి వేసి తీయడం లేదు
ABN, First Publish Date - 2022-08-20T17:56:54+05:30
సీఎం జగన్(CM Jagan) బటన్ మీద చెయ్యి వేసి తియ్యడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ఎద్దేవా చేశారు
Vijayawada : సీఎం జగన్(CM Jagan) బటన్ మీద చెయ్యి వేసి తియ్యడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ఎద్దేవా చేశారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కానుకల రూపంలో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా బటన్ నొక్కుదామని చూస్తున్నారన్నారు. ఏపీలో నాలుగు ప్రాంతాల్లో యువ మోర్చా(Yuva Morcha) ఆధ్వర్యంలో 173 నియోజకవర్గాల్లో యాత్ర చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ మోసాలను ప్రజలకు వివరించామన్నారు. కాకినాడ(Kakinada)లో పెట్రో కెమికల్ కారిడార్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎయిమ్స్(AIMS) వంటి సంస్థలను కేంద్రం ఏపీకి ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన వాటిని కూడా ఏపీ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోతోందన్నారు. రేపు విజయవాడలో యువ సంఘర్షణ ముగింపు సభ జరుగనుందన్నారు.
Updated Date - 2022-08-20T17:56:54+05:30 IST