ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పథకాలను ఆపేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు?: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-06-29T03:07:17+05:30

ఆ పథకాలను ఆపేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు?: సోమిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్టీఆర్ వంటి రాజకీయనాయకులు, ప్రజాసేవకులు రాజకీయాల్లో అరుదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మద్యనిషేధం హామీని మొదటి సంతకంతో అమలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. దశలవారీ మద్యనిషేధం పేరుతో మోసం చేసిన వ్యక్తి జగన్ అన్నారు.  నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. తలపండిన రాజకీయనాయకులకు రానీ ఆలోచనలు ఎన్టీఆర్ అమలు చేశారని కొనియాడారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చారని చెప్పారు. సాగునీటి మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇదన్నారు. పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఇప్పుడు కన్నబిడ్డలకు అన్నం పెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో 2వేల 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం రైతులకు ఇచ్చే పథకాలు కూడా ఆపేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-29T03:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising