ధవళేశ్వరం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద
ABN, First Publish Date - 2022-07-09T15:35:34+05:30
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీరు స్వల్పంగా పెరుగుతోంది.
రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం (dhavaleswaram) కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీరు స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 9.7 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో అధికారులు లక్షా 20 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అటు పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ ఎగువన ఉన్న గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది.
Updated Date - 2022-07-09T15:35:34+05:30 IST