ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర జవాన్‌ జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర

ABN, First Publish Date - 2022-01-26T09:06:51+05:30

ఆర్మీలో సుబేదారుగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన గుంటూరు జిల్లా వాసి మరుప్రోలు జశ్వంతరెడ్డికి ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనకు ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి), బాపట్లరూరల్‌,  జనవరి 25: ఆర్మీలో సుబేదారుగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన గుంటూరు జిల్లా వాసి మరుప్రోలు జశ్వంతరెడ్డికి ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. బాపట్ల మండలం, ధరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంతరెడ్డి.. 2016లో ఆర్మీలో చేరారు. గతేడాది జూలై 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో ఆయనకు శౌర్యచక్ర అందిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా జశ్వంతరెడ్డి తండ్రి మరుప్రోలు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణకై తన కుమారుడు ప్రాణాలను అర్పించడం గర్వంగా ఉందని తెలిపారు. జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

Updated Date - 2022-01-26T09:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising