ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్క భజన మంత్రులు అవుతారనుకోలేదు: శైలజానాథ్

ABN, First Publish Date - 2022-04-12T21:45:14+05:30

అమరావతి: ఏపీ మంత్రి వర్గంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ మంత్రి వర్గంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డమ్మీ మంత్రులే అనుకున్నాం, కానీ ఇలా చెక్క భజన మంత్రులు అవుతారనుకోలేదని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. నాలుగో స్తంభమైన మీడియాను అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని, తక్షణమే జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డమ్మీలతో సీఎం జగన్ చెక్కభజన చేయించుకుంటున్నారని శైలజానాథ్ విమర్శించారు.


మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యలు

జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే సీఎం జగన్‍ను ఆరాధించాలి కానీ ఆరా తీయొద్దంటూ సలహాలిచ్చారు. ఆరాతీయడమే తమ ఉద్యోగమని జర్నలిస్టులు పేర్కొన్నారు. దీనిపై మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‍ను ఆరాధించాను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది’’ అని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను పలువురు జర్నిలిస్టులు తప్పుబడుతున్నారు.

Updated Date - 2022-04-12T21:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising