చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-04-27T16:57:10+05:30
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పెద్ద ఉన్మాదని అన్నారు. టీడీపీ నేతలు సీఎం జగన్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని, చర్యలు తీసుకుంటామని అన్నారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు.. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలన్నారు. చీర కావాలో.. చుడిదార్ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు. టీడీపీ మహిళ ద్రోహి పార్టీ అని రోజా తీవ్రస్థాయిలో విమర్శించారు.
టీడీపీలో ఉన్న ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరని మంత్రి రోజా అన్నారు. మహిళ కనిపిస్తే వాటేసుకోవాలి, ముద్దుపెట్టుకోవాలని.. చంద్రబాబు వియ్యంకుడు అనలేదా.. అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఆమె అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతని దుయ్యబట్టారు. మహిళలను బూటుకాలితో తన్నిన చరిత్ర టీడీపీదని అన్నారు. బాధితురాలికి పరామర్శ పేరుతో హడావుడి చేశారని, టీడీపీ ఎందుకు నిరసనలు చేస్తుందో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-04-27T16:57:10+05:30 IST