ఆగివున్న లారీని ఢీకొట్టిన మార్నింగ్ ట్రావెల్స్ బస్సు..
ABN, First Publish Date - 2022-04-27T12:17:36+05:30
పెనుగంచిప్రోలు మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తోటచర్ల దగ్గర ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్
ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తోటచర్ల దగ్గర ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-04-27T12:17:36+05:30 IST