కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN, First Publish Date - 2022-07-27T12:55:10+05:30
కర్నూలు(Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు లారీని ఢీకొట్టింది
కర్నూలు : కర్నూలు(Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు గణేష్, రుద్ర, సోమ శేఖర్ గా పోలీసులు గుర్తించారు. మ్రుతులు.. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన వారుగా గుర్తించారు.
Updated Date - 2022-07-27T12:55:10+05:30 IST