Flood: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి
ABN, First Publish Date - 2022-08-09T13:37:36+05:30
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ (Dhavaleshwaram Cotton Barrage) వద్ద గోదావరి వరద (Flood) పెరుగుతోంది.
రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ (Dhavaleshwaram Cotton Barrage) వద్ద గోదావరి వరద (Flood) ఉధృతి కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్ వద్దకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కులు వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 9.5 అడుగులకు చేరింది. రానున్న రెండు రోజల్లో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పది లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది.
Updated Date - 2022-08-09T13:37:36+05:30 IST