కరోనా దృష్ట్యా శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు
ABN, First Publish Date - 2022-01-17T01:51:28+05:30
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా దృష్ట్యా శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు.
కర్నూలు: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా దృష్ట్యా శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి స్వామివారి స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అన్నప్రసాదం, వేదాశీర్వచనం, పుణ్యస్నానాలు నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. భక్తులు ఆన్లైన్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని లవన్న సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Updated Date - 2022-01-17T01:51:28+05:30 IST