ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపుతప్పిన ‘ఎర్ర’దొంగల కారు.. ఇంటిని ఢీకొట్టగా భారీ శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా..!

ABN, First Publish Date - 2022-02-03T12:50:15+05:30

ఎర్రచందనం తరలిస్తున్న ఓ కారు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మహిళకు గాయాలు 
  • పరారైన ఇద్దరు స్మగ్లర్లు 

చిత్తూరు జిల్లా/శ్రీకాళహస్తి : ఎర్రచందనం తరలిస్తున్న ఓ కారు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా, స్మగ్లర్లు వాహనం వదలి పరారయ్యారు. వివరాలివీ... ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఓ కారు బుధవారం ఉదయం తిరుపతి నుంచి పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారివైపు వచ్చింది. ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలం కన్నలి ఎస్టీకాలనీ వద్దకు రాగానే, వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శ్రీకాళహస్తి భాస్కరయ్య స్వల్పంగానూ, ఆయన భార్య రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. భారీ శబ్ధం విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు కారులో ఇరుకున్న ఇద్దరు స్మగ్లర్లు అతికష్టంపై బయటికి వచ్చి పరారయ్యారు. అనంతరం గాయపడిన బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి టూటౌన్‌ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎస్టీకాలనీ చేరుకుని, వాహనంతోపాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-02-03T12:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising