ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్ల కోసం నెల్లూరు కోర్టులో చోరీ జరిగిందని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదం: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-04-17T23:39:35+05:30

ఫోన్ల కోసం నెల్లూరు కోర్టులో చోరీ జరిగిందని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫోన్ల కోసం నెల్లూరు కోర్టులో చోరీ జరిగిందని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 కేసుల్లో ఆరితేరిన దొంగ.. సెల్‌ఫోన్ల కోసం కోర్టు లాకర్‌లో చోరీ చేస్తాడా? అని ప్రశ్నించారు. ఫోన్లు సెల్‌షాప్‌లో ఉంటాయో..కోర్టు లాకర్‌లో ఉంటాయో.. ఎస్పీ సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఫోన్ల కోసం వచ్చిన దొంగ.. మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులోని.. ఫోర్జరీ పత్రాలు, ఇతర సాక్ష్యాలు ఎందుకు తీసుకెళ్తాడని నిలదీశారు. చోరీ ఘటనను తప్పుదోవ పట్టించేలా ఎస్పీ వ్యాఖ్యలు ఉన్నాయని తప్పుబట్టారు. చోరీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-17T23:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising