జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
ABN, First Publish Date - 2022-01-12T21:16:21+05:30
సీఎం జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 10 పీఆర్సీలలో ఇంటీరియం
అమరావతి: సీఎం జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు 2021 అక్టోబర్ నాటికే రెండేళ్లు పూర్తైందని, తక్షణమే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసి.. పే స్కేల్ను అమలు చేయాలని లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-01-12T21:16:21+05:30 IST