ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక ఫిల్మ్ మేకర్‌గా వచ్చా.. ఎవరేం మాట్లాడినా నాకు సంబంధం లేదు: ఆర్జీవీ

ABN, First Publish Date - 2022-01-10T19:16:12+05:30

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు ఏపీలో సినిమా టికెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో సమావేశం కానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు ఏపీలో సినిమా టికెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనను భారీ బందోబస్తు నడుమ ఎయిర్‌పోర్టు నుంచి పోలీసులు వెలగపూడి సచివాలయానికి తీసుకెళ్లారు. కాగా.. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పేర్ని నానితో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తా. ఒక ఫిల్మ్ మేకర్‌‌గా మాట్లాడడానికి వచ్చాను. ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి వచ్చాను. ఎవ్వరేం మాట్లాడినా దాని గురించి నేను మాట్లాడను’’ అని పేర్కొన్నారు. కాగా.. నేడు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై వర్మ వెరైటీగా స్పందించారు.‘అందరికీ నోరు ఉంటుంది. అందరికీ ఒపీనియన్ ఉంటుంది.. నా లాగే’ అని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కామెంట్ చేశారు.


Updated Date - 2022-01-10T19:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising