త్వరలో ఏపీకి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి: రఘురామ
ABN, First Publish Date - 2022-02-28T20:21:45+05:30
ఏపీలో ప్రస్తుతం రుణానాంధ్రలహరి నడుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీలో ప్రస్తుతం రుణానాంధ్రలహరి నడుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఏపీకి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయన్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి అప్పులు తీసుకునే అనుమతి లేదని, బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆస్తులు తనఖా పెట్టి.. మళ్లీ కొత్త అప్పులు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అభివృద్ధిలేని అప్పు.. ప్రజలకు శాపంగా మారుతుందని, అప్పులన్నీ తీసుకొచ్చి పథకాలు ఇచ్చినా పర్లేదు కానీ.. అసలు తీసుకొచ్చిన అప్పులు ఏమౌతున్నాయని ఆయన ప్రశ్నించారు. జగనన్న తోడుకు ఇచ్చే నిధులు తక్కువ.. ప్రకటనలు ఎక్కువని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు.. ప్రయత్నం చేస్తున్నారనే వార్తలొస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Updated Date - 2022-02-28T20:21:45+05:30 IST