చిక్కిపై బొమ్మ ఎందుకు సీఎం గారు: రఘురామ
ABN, First Publish Date - 2022-04-09T20:21:37+05:30
చిక్కిపై బొమ్మ ఎందుకు సీఎం గారు అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ను ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఢిల్లీ: చిక్కిపై బొమ్మ ఎందుకు సీఎం గారు అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ను ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీలైతే భారతి సిమెంట్పై వేయించుకోవాలని పేర్కొన్నారు. జగన్ తన వెంట్రుక కూడా పీకలేరు అనడం ఎందుకు.. ఆయన దగ్గరకి ఎవరు వస్తారు? అని ప్రశ్నించారు. సర్పంచులు గుండు గీసుకొని రోడ్డెక్కారని తెలిపారు. హైదరాబాద్లో తనపై నిఘా పెట్టారని, జగన్రెడ్డి ఆదేశాలతో పోలీసులు తనను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. వై కేటగిరి భద్రత ఉన్న ఒక ఎంపీని లేపేయాలని చూస్తారా.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
Updated Date - 2022-04-09T20:21:37+05:30 IST