ఏబీ Venkateswara Rao పోరాటం చివరికి ఫలించింది: Raghurama
ABN, First Publish Date - 2022-06-16T20:22:14+05:30
ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం చివరికి ఫలించిందని రాఘురామ కృష్ణంరాజు అన్నారు.
New Delhi: ఏబీ వెంకటేశ్వరరావు (Venkateswara Rao) పోరాటం చివరికి ఫలించిందని, ఆయనను అభినందిస్తున్నానని ఎంపీ రాఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా.. గొప్ప పోస్ట్ కాకపోయినా స్టాంప్స్, స్టేషనరీ డిపార్ట్మెంట్ ఇచ్చారన్నారు. ఆలస్యం అయినా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇచ్చిన మాట తప్పితే రాజకీయాల్లో ఉండటానికి అర్హులా అని జగన్ (Jagan) గతంలో అన్నారని, మరి ఎన్నికల్లో జగన్ ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని తప్పారో తెలుస్తోందని రఘురామ అన్నారు.
Updated Date - 2022-06-16T20:22:14+05:30 IST