అవినీతిని సహించనని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామ
ABN, First Publish Date - 2022-04-21T20:18:08+05:30
అవినీతిని సహించనని జగన్మోహన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ అన్నారు.
న్యూఢిల్లీ: అవినీతిని సహించనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుడూ సీఎం ఇలా మాటిమాటికీ అవినీతి అంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఏపీ రాష్ట్రంలో అవినీతికి మొదటి పాయింట్ రాజకీయ నేతలే అన్నారు. అవినీతి నిర్మూలన కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి.. ‘‘ముందు మీపై ఉన్న కేసులు ఫైనల్ చేయించుకోండి.. మీ కేసులు త్వరగా పూర్తి చేయాలని కోరితే నా కాళ్లు హూనం చేశారు.’’
ఒకప్పటి బిహార్ ఘటనలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అధికారం కోసం ముద్దులు పెడుతూ జనంలో తిరిగిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు తిరగాలంటే ఎందుకు భయపడుతున్నారని రఘురామ ప్రశ్నించారు.
Updated Date - 2022-04-21T20:18:08+05:30 IST