Vijayawadaలో పూరీజగనాథ రథయాత్ర.. ప్రారంభించనున్న గవర్నర్
ABN, First Publish Date - 2022-07-08T19:31:02+05:30
నగరంలో ఇష్కాన్ ఆధ్వర్యంలో పూరీ జగన్నాధుడి రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
విజయవాడ: నగరంలో ఇష్కాన్ ఆధ్వర్యంలో పూరీ జగన్నాధుడి రథయాత్ర (Puri Jaganna Rath Yatra)కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వజ్రగ్రౌండ్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Bishwabhushan harichandan) రథయాత్రను ప్రారంభించనున్నారు. గవర్నర్ (Governor) రాక నేపథ్యంలో పోలీసులు (Police) పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రథయాత్ర సాగనుంది. వజ్రగ్రౌండ్ నుండి ప్రారంభమై రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపల్ వద్ద జగన్నాథుడి రథయాత్ర ముగియనుంది.
Updated Date - 2022-07-08T19:31:02+05:30 IST