పులివెందుల్లోనూ బ్యారికేడ్లు
ABN, First Publish Date - 2022-07-07T02:38:03+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్రెడ్డి పర్యటన అంటే చాలు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన పర్యటించే జిల్లాలో బ్యారికేడ్లు
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్రెడ్డి పర్యటన అంటే చాలు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన పర్యటించే జిల్లాలో బ్యారికేడ్లు, పరదాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మల్లించడం వల్ల జనాలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి సీఎం సొంత ఊరు పులివెందుల వాసులకు వచ్చింది. సీఎం జగన్ గురు, శుక్రవారాల్లో సొంత నియోజకవర్గంలోని పులివెందుల, వేంపల్లెలో పర్యటించనున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లోని పులివెందుల్లోని ప్రధాన రోడ్డులోనే ఆర్అండ్బీ అతిథి గృహం ఉంది. ఈ రోడ్డు అంతా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముద్దనూరు రోడ్డులో ఉన్న ఏపీ కార్ల్ వరకు బ్యారికేడ్లు వేశారు.
వేంపల్లెలో కూడా వేంపల్లి - కడప రహదారిలోని సీఎం పర్యటించే ప్రాంతాల్లోని రహదారుల్లో బ్యారికేడ్లు ఉంచారు. సీఎం జగన్ సొంత ఊరి పర్యటనకు వస్తున్నారు. ప్రజలకు దగ్గరవుతారనుకుంటే ఇంత పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం చూసి ఔరా అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత మొదలైందని, పులివెందుల్లో కూడా అదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనం ఎక్కడ నిలదీస్తారోనన్న భయం అధికారులు, స్థానిక నేతల్లో ఉంది. పులివెందుల్లో జగన్ను నిలదీస్తే అది సంచలనం అవుతుంది. అందుకే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీఎం పర్యటించే ప్రాంతాల్లోని రహదారుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారని అంటున్నారు.
Updated Date - 2022-07-07T02:38:03+05:30 IST