ఎమ్మెల్యే ఆదిమూలానికి నిరసన సెగ
ABN, First Publish Date - 2022-08-11T08:47:52+05:30
ఎమ్మెల్యే ఆదిమూలానికి నిరసన సెగ
సత్యవేడు, ఆగస్టు 10: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి సొంత పార్టీ ఎంపీటీసీ నుంచే నిరసన సెగ తగిలింది. చెరివి సచివాలయ పరిధి మాదనపాళెంలో బుధవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎంపీటీసీ రామయ్య తన సెగ్మెంట్లో శ్రీసిటీ సెజ్ భూమి సమస్యలపై మాట్లాడుతుండగా ఎమ్మెల్యే అసహనంతో వేదిక దిగేశారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన రామయ్య వర్గీయులు ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే భారీ భద్రతతో చెరివి, చిగురుపాళెం గ్రామాల్లో పర్యటించారు.
Updated Date - 2022-08-11T08:47:52+05:30 IST