ప్రధానిని విల్లుతో సత్కరించిన Jagan
ABN, First Publish Date - 2022-07-04T17:07:28+05:30
అల్లూరి సీతారామరాజు (Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) భీమవరం చేరుకున్నారు.
పశ్చిమగోదావరి: అల్లూరి సీతారామారాజు (Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పాల్గొన్నారు. భీవమరంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన సభావేదికపైకి వెళ్లిన ప్రధానిని సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) విల్లుతో సత్కరించారు. ఆ వెంటనే ప్రధాని విల్లును ఎక్కుపెట్టారు. అనంతరం 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని వర్చువల్గా ఆవిష్కరించారు. ఆపై అల్లూరి కుటుంబసభ్యులను సత్కరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy), గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Bishwabhushan harichandan), సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi), మంత్రి రోజా (Roja), బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) తదితరులు పాల్గొన్నారు. ప్రధాని సభ కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు.
Updated Date - 2022-07-04T17:07:28+05:30 IST