పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-20T02:07:33+05:30
జిల్లాలోని పామూరు మండలం ఉప్పుకయ్యవంకలో విషాదఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రకాశం: జిల్లాలోని పామూరు మండలం ఉప్పుకయ్యవంకలో విషాదఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగులమందు తాగిన ఇనిమెర్ల గ్రామానికి చెందిన దంపతులు ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులుఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Updated Date - 2022-01-20T02:07:33+05:30 IST