ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరాల నడిబొడ్డులో ఏం జరిగిందంటే.. భర్త టిఫిన్ తెచ్చేందుకు వెళ్లి తిరిగొచ్చి చూసేసరికి..

ABN, First Publish Date - 2022-08-30T23:51:11+05:30

చీరాల నడిబొడ్డులో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. నేరెళ్లవారి వీధిలో ఊట్ల మదనగోపాలమూర్తి, విజయలక్ష్మి (55) దంపతులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల టౌన్‌ (ప్రకాశం జిల్లా): చీరాల నడిబొడ్డులో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే..  నేరెళ్లవారి వీధిలో ఊట్ల మదనగోపాలమూర్తి, విజయలక్ష్మి (55) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు భర్త టిఫిన్‌ తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. దాదాపు 45 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తి ఇంటి నుంచి పరారవుతుండడం చూశాడు. భయాందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భార్య విగతజీవిగా పడి ఉంది. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించగా సీఐ మల్లికార్జునరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా నీలి రంగు లుంగీ, తెలుపు రంగు చొక్కాతో నిందితుడు పరారవుతున్నట్లు పోలీసులు గ్రహించినట్లు సమాచారం. మహిళను హతమార్చి బంగారు ఆభరణాలతో పరారైనట్లు నిర్ధారించారు.

Updated Date - 2022-08-30T23:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising