వృథా నీటిని అరికట్టాలి
ABN, First Publish Date - 2022-01-22T06:21:44+05:30
మోపాడు రిజర్వాయర్లోని నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసి రిజర్వాయర్ నిండుకుండలా మారిన విషయం తెలిసిందే.
పామూరు, జనవరి 21: మోపాడు రిజర్వాయర్లోని నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసి రిజర్వాయర్ నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. రిజర్వాయర్లో వృథాగా పోతున్న నీటితో కంభాలదిన్నె, తూర్పుకట్టకిందపల్లి తదితర గ్రామాల ఆయకట్లు రైతులు జొన్న, బొబ్బర్లు లాంటి మెట్ట పంటలను సాగుచేసుకున్నారు. ప్రస్తుతం తూము గేటు పైకి లేపి మరోసారి దించే క్రమంలో గేటు లాక్ అయ్యింది. హుటాహుటిన ఇరిగేషన్శాఖ అధికారులు సంబంధిత ఇరిగినే్షశాఖ సిబ్బందితో మరమ్మత్తులు చేపట్టినా నీటి ఉదృతి ఆగలేదు. నీటి ఉదృతి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరమ్మతులు చేయలేక పోతున్నామని సిబ్బంది తెలిపారు. రైతులతో కలిసి గడ్డితో నీటి ఉదృతి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మోపాడు రిజర్వాయర్ డీఈ రవికుమార్ తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి తూము గేట్లు ఎత్తకపోవడంతో అవి స్వల్పంగా మరమ్మత్తులకు గురవుతున్నాయని వాటికి మరమ్మతులు చేస్తున్నామన్నారు.
Updated Date - 2022-01-22T06:21:44+05:30 IST