ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకల తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ABN, First Publish Date - 2022-05-20T05:14:18+05:30

ఇంటర్‌ పరీక్షలు పూర్తిచేసుకొని సరదాగా సముద్రతీరంలో స్నేహితులతో కలిసి సముద్రస్నానం చేయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడగా మరొకరిని మెరైన్‌ పోలీసులు కాపాడారు. మెరైన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరులోని ఓ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు పూర్తిచేసుకొన్న విద్యార్థులు పదిమంది గురువారం సాయంత్రం సింగరాయకొండ మండలంలోని పాకల సముద్రస్నానానికి వెళ్లారు.

హేమంత్‌రెడ్డికి ప్రథమ చికిత్స చేస్తున్న మెరైన్‌ కానిస్టేబుళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒకరి మృతి.. మరొకరిని కాపాడిన మెరైన్‌ పోలీసులు

సింగరాయకొండ, మే 19 : ఇంటర్‌ పరీక్షలు పూర్తిచేసుకొని సరదాగా సముద్రతీరంలో స్నేహితులతో కలిసి సముద్రస్నానం చేయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడగా మరొకరిని మెరైన్‌ పోలీసులు కాపాడారు. మెరైన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరులోని ఓ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు పూర్తిచేసుకొన్న విద్యార్థులు పదిమంది గురువారం సాయంత్రం సింగరాయకొండ మండలంలోని పాకల సముద్రస్నానానికి వెళ్లారు. తీరంలో ఉన్న వంతెన సమీపంలో ఉల్లాసంగా మునుగుతున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చిన అల ధాటికి కందుకూరుకి చెందిన పళ్లగళ్ల హేమంత్‌కుమార్‌రెడ్డి, గుడ్లూరుకి చెందిన చరణ్‌సాయి సముద్రంలోకి కొట్టుకుపోయారు. గమనించిన వారి స్నేహితులు పెద్దగా కేకలు పెట్టారు. వెంటనే ఒడ్డున ఉన్న మెరైన్‌ కానిస్టేబుళ్లు అప్రమత్తమై సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని ఒడ్డుకి చేర్చారు. మెరైన్‌ కానిస్టేబుళ్లు సకాలంలో అందించిన ప్రఽథమ చికిత్సతో చరణ్‌సాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హేమంత్‌కుమార్‌రెడ్డికి ప్రఽథమ చికిత్స చేసినా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. వాహనంలో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై లంకా సంపత్‌కుమార్‌ మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-05-20T05:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising